50 చేసినా... మనమే గెలిచాం

Published on Tue, 11/19/2019 - 03:47

ప్రావిడెన్స్‌ (గయానా): విండీస్‌ గడ్డపై భారత్‌ మహిళల జట్టు విజయగర్జన కొనసాగుతోంది. ఇప్పటికే ఎదురులేని విజయాలతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ నాలుగో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ జట్టును కంగుతినిపించింది. చిత్రంగా కేవలం 50 పరుగులే చేసినా...  ప్రపంచ చాంపియన్‌ జట్టుపై టీమిండియా గెలుపొందడం విశేషం. వర్షంతో ఈ 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 9 ఓవర్లలో 7 వికెట్లకు 50 పరుగులు చేసింది. పూజ పది పరుగులే టాప్‌ స్కోర్‌! హేలీ మాథ్యూస్‌ 3, అఫీ, షెనెటా చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన విండీస్‌ 5 పరుగుల దూరంలో నిలిచింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లకు 45 పరుగులే చేయగలిగింది. హేలీ 11, హెన్రీ 11, మెక్‌లీన్‌ 10 పరుగులు చేశారు. విండీస్‌ గెలిచేందుకు చివరి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా... అనూజ వేసిన ఆఖరి ఓవర్లో విండీస్‌ 7 పరుగులే చేసి 2 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో అనూజ పాటిల్‌ (2/8) రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ (1/8), రాధా యాదవ్‌(1/8)లకు ఒక్కో వికెట్‌ దక్కింది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4–0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌... గురువారం ఆఖరి మ్యాచ్‌ను ఇదే వేదికపై ఆడనుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ