amp pages | Sakshi

వన్డే సిరీస్‌పైనే టీమిండియా గురి

Published on Thu, 03/07/2019 - 13:26

రాంచీ: ఆస్ట్రేలియాతో రెండు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌ను దక్కించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు.. మూడో వన్డేలో సైతం గెలుపొంది ముందుగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి కసరత్తులు చేస్తోంది. శుక్రవారం రాంచీ వేదికగా జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగనున్న మూడో వన్డేలో భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేకు వేదిక అయిన ఈ మైదానంలో బహుశా ధోనికిదే చివరి మ్యాచ్‌ కావచ్చు. ఈ నేపథ్యంలో రాంచీ విజయాన్ని ధోని కానుకగా ఇవ్వాలని భారత జట్టు యోచిస్తోంది. రేపు మధ్యాహ్నం గం.1.30ని.లకు మూడో వన్డే ఆరంభం కానుంది.

హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో, నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో సమిష్టిగా పోరాడి విజయాల్ని సాధించిన భారత్‌.. మూడో వన్డేకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. ఈ వన్డే సిరీస్‌ను ముందుగానే ముగించాలని భావిస్తున్న విరాట్ సేన మూడో వన్డేకు సైతం గత జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. చివరి రెండు వన్డేల్లో శిఖర్‌ ధావన్‌ ఆశించిన స్థాయిలో రాణించినప్పటికీ అతన్ని తొలగించేందుకు టీమిండియా యాజమాన్యం సుముఖంగా ఉండకపోవచ్చు. ధావన్‌ తాను ఆడిన గత 15 వన్డేల్లో కేవలం రెండు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేసినా రెగ్యులర్‌ ఓపెనర్‌ కావడంతో  అతన్ని తీసే సాహసం చేయకపోవచ‍్చు. అందులోనూ వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌ ఆడుతున్న కీలక సిరీస్‌ కావడంతో మూడో వన్డేలో ధావన్‌ను కొనసాగించేందుకే ఎక్కువ ఛాన్స్‌ ఉంటుంది. ఇక్కడ కేఎల్‌ రాహుల్‌ ఉన్నప్పటికీ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలనుకుంటున్న భారత్‌.. ఎటువంటి ప్రయోగాలకు ఆస్కారం ఇవ్వకపోవచ్చు. ఒకవేళ రాహుల్‌కు చాన్స్‌ ఇవ్వాలని అనుకుంటే మాత్రం అంబటి రాయుడుకి ఉద్వాసన తప్పదు. ఆసీస్‌త్ రెండు వన్డేల్లోనూ రాయుడు నిరాశపరచడంతో ఆ స్థానాన్ని రాహుల్‌తో భర్తీ చేయవచ్చు.

ఇక ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత్‌ నాలుగు వన్డేలు ఆడగా రెండింట విజయం సాధించింది.  2013లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా,  2016లో న్యూజిలాండ్‌తో భారత్‌ చివరిసారి తలపడిన వన్డేల్లో ఓటమి పాలైంది.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌