వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
‘గ్రేట్ విరాట్ కోహ్లి సంతోషిస్తాడు’
Published on Mon, 11/18/2019 - 12:57
కోల్కతా: బంగ్లాదేశ్తో జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్కు సంబంధించి తొలి మూడు రోజులకు టికెట్లు అమ్ముడుపోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని గ్రేట్ అంటూ కొనియాడాడు. ‘ గ్రేట్ విరాట్ కోహ్లి రాకతో ఈడెన్ గార్డెన్ గ్యాలరీలు హౌస్ఫుల్ అవుతాయి. దీన్ని చూసి కోహ్లి సంతోషిస్తాడు. టెస్టు క్రికెట్కు అభిమానుల్ని తీసుకురావడం అంత తేలిక కాదు. ఇది డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కావడంతో ప్రేక్షక్షులు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలి. ఈడెన్లో ఏర్పాట్లు మైమరిపిస్తాయి. తొలి మూడు రోజులు అభిమానులతో ఈడెన్ కిక్కిరిసిపోతుంది’ అని గంగూలీ పేర్కొన్నాడు. బంగ్లాతో జరిగే రెండో టెస్టులో భారత్ కలకత్తాలోని ఈడెన్ గారెన్స్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భం గంగూలీ మాట్లాడాడు.
ఈ మ్యాచ్లోనూ ఇండియా నెగ్గి ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో తన ప్రథమ స్థానాన్ని మరింత పదిల పరుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందనీ, భారత విజయాన్ని బంగ్లా అడ్డుకోబోదనే ధీమా వ్యక్తం చేశారు. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 300 పాయింట్లు సాధించి టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Tags