రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ ఆశలు సజీవం
Published on Mon, 07/30/2018 - 01:30
లండన్: ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా నిలిచాయి. పూల్ ‘బి’లో భాగంగా అమెరికా జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ను భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. అమెరికా తరఫున మార్గాక్స్ (11వ ని.లో), భారత్ తరఫున కెప్టెన్ రాణి రాంపాల్ (31వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం పూల్ ‘బి’లో రెండు పాయింట్లతో భారత్, అమెరికా సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.
అయితే మెరుగైన గోల్స్ సగటులో భారత్ (–1) ముందంజలో ఉండగా... అమెరికా (–2) నాలుగో స్థానంలో ఉంది. పూల్ ‘బి’లో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ ముగిశాకే మంగళవారం జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్లో భారత ప్రత్యర్థి (ఇటలీ లేదా కొరియా) ఎవరో తేలుతుంది.
#
Tags