రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాటా ఓపెన్ ఫైనల్లో దివిజ్–బోపన్న జంట
Published on Sat, 01/05/2019 - 01:09
పుణే: ఈ ఏడాదిని టైటిల్తో ప్రారంభించేందుకు భారత టెన్నిస్ జంట దివిజ్ శరణ్–రోహన్ బోపన్న విజయం దూరంలో నిలిచింది. టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో దివిజ్–బోపన్న ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ దివిజ్–బోపన్న జంట 6–3, 3–6, 15–13తో ‘సూపర్ టైబ్రేక్’లో సిమోన్ బొలెలీ (ఇటలీ)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జంట మూడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. నేడు జరిగే ఫైనల్లో ల్యూక్ బాంబ్రిడ్జ్–జానీ ఒమారా (బ్రిటన్)లతో దివిజ్–బోపన్న తలపడతారు.
#
Tags