వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అవసరమైతే వస్తా...
Published on Mon, 04/02/2018 - 04:41
న్యూఢిల్లీ: తుది జట్టులో ఆడే అవకాశం లేకపోవడం తో... ఆ సమయాన్ని అమెరికాలో ప్రాక్టీస్ చేసుకునేందుకు కేటాయించాలని భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఈనెల 6, 7 తేదీల్లో చైనాతో జరిగే డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ ఆడేందుకు చైనా వెళ్లడం లేదని తెలిపాడు.
డబుల్స్లో లియాండర్ పేస్–బోపన్న జంట బరిలోకి దిగడం ఖాయం కాబట్టి దివిజ్కు మ్యాచ్ ఆడే అవకాశం రావడం కష్టమే. ఈ మేరకు దివిజ్ తన నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) అధికారులకు తెలపగా... వారు దానికి అంగీకరించారు. తన అవసరం ఉంటే వెంటనే చైనాకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నానని దివిజ్ తెలిపాడు.
#
Tags