amp pages | Sakshi

‘క్రికెటర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే’

Published on Sat, 09/21/2019 - 17:58

ముంబై : ఈ మధ్య కాలంలో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అభిమానులు, అపరిచితులు మైదానాల్లోకి దూసుకవస్తుండటంపై  బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మొహాలి వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో అభిమానులు రెండు సార్లు మైదానంలోకి వచ్చి ఆటకు ఆటంకం కలిగించారని గుర్తుచేశారు. అయితే తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమ ఉండటం సహజమని కానీ ఇది సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ఆటగాళ్లు హోటల్‌ నుంచి బయల్దేరిన మొదలు తిరిగి వారి గమ్యస్థానానికి చేరుకునేవరకు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఆసోసియేషన్లే భద్రత కల్పించాలని స్పష్టం చేశాడు. ఈ మేరకు క్రికెట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అసోసియేషన్లకు అజిత్‌ సింగ్‌ లేఖ రాశాడు. 

‘ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 రద్దవడంతో టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెండో మ్యాచ్‌ కోసం మొహాలికి ముందుగానే చేరుకున్నారు. అయితే స్థానిక అసోసియేషన్‌తో ఉన్న సమస్యల కారణంగా క్రికెటర్లకు చండీగఢ్‌ పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదు. దీంతో తొలి రోజు హోటల్‌ యాజమాన్యమే ఆటగాళ్లకు ప్రయివేట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. రెండో రోజుకు గాని పోలీసులు ఆటగాళ్లకు భదత్ర కల్పించలేదు. ఇది చాలా విచారకరం. క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత అసోసియేషన్లదే. అంతేకాకుండా మొహాలి మ్యాచ్‌లో మైదానంలోకి ఫ్యాన్స్‌ చొచ్చుకొచ్చారు. లాంగాఫ్‌, లాంగాన్‌, మిడాన్‌, మిడాఫ్‌, డీప్‌ థర్డ్‌మన్‌ వంటి ఫీల్డింగ్‌ పొజిషన్ల నుంచి బయటివాళ్లు మైదానంలోకి దూసుకొస్తున్నారు. దీంతో ఈ స్థానాల వద్ద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. మరోసారి మొహాలి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వహించాలి’అంటూ అజిత్‌ సింగ్‌ లేఖలో పేర్కొన్నాడు. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)