బాబు చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసింది: గంగుల

Published on Thu, 06/20/2019 - 19:42

కర్నూలు: టీడీపీ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ శాసన మండలి విప్‌, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ప్రభాకర్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి పాలనకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని విమర్శించారు. బాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసిందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు.

అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పేద కుటుంబాలకు విద్యను అందించే దిశగా వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ