amp pages | Sakshi

‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

Published on Thu, 06/13/2019 - 14:49

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రైతులందరికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పి, చేసిన తప్పు ఒప్పుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులను మోసం చేసినందుకే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రైతుల రుణాలు ఎగ్గొట్టి ఇప్పుడు సిగ్గు లేకుండా తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అయిదేళ్లలో రైతులకు ఇచ్చిన బాండ్లకు చంద్రబాబు డబ్బులు ఎందుకు చెల్లించలేదని రోజా సూటిగా ప్రశ్నించారు. 

చంద్రబాబు హామీలు ఇచ్చి...వాటిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయాలంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతుల విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు తాను తప్పు చేసినట్లు అసెంబ్లీలో ఒప్పుకుంటే... ముఖ్యమంత్రి కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. అధికారంలోకి వచ్చి పదిరోజులు కాకముందే టీడీపీ నేతల కడుపు మంట బయటపడుతోందని రోజా అన్నారు. ఇక గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతకు మైక్‌ కూడా ఇవ్వకుండా అవమానించారని, అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తారని రోజా అన్నారు. ఏ అంశంపైన అయినా ముఖ్యమంత్రి సమాధానం ఇస్తామని ఆమె పేర్కొన్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌