amp pages | Sakshi

‘చంద్రబాబువి పసలేని ఆరోపణలు’

Published on Mon, 09/23/2019 - 12:44

సాక్షి, చిత్తూరు(పీలేరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.  ఆదివారం ఆయన పీలేరు మండలంలోని తలుపుల పంచాయతీ, అబ్బవరం వారిపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 1,34,000 ఉద్యోగాలకు ఒకే విడతలో నోటిఫికేషన్‌ జారీచేసి, అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేశారు. 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ విషయమన్నాన్నారు. ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో చంద్రబాబు, ఆయన తోక పత్రికలు జీర్ణించుకోలేక పరీక్ష పేపరు లీకైందంటూ ప్రభుత్వంపై బురద జల్లే ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్ర అభివృద్ధిని మరిచి దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. తనకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న పత్రికలకు వందల కోట్ల రూపాయలు దోచి పెట్టి రాష్ట్రాన్ని అవినీతిలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నాన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు తమ తీరుమార్చుకోకుంటే ప్రజల్లో మున్న కనీస గుర్తింపు కూడా కోల్పోక తప్పదని జోస్యం చెప్పారు. నాయకులు మల్లికార్జునరెడ్డి, మస్తాన్, చక్రపాణిరెడ్డి, మదన, కేశవరెడ్డి, ఆంజినేయులు, శేఖర్, నాగిరెడ్డి, గేట్‌ పీర్‌ పాల్గొన్నారు.

అబ్బవరం వారిపల్లిలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే చింతల 

Videos

Play Offs లోకి ఆర్సిబీ

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

Photos

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)