amp pages | Sakshi

బ్రాహ్మణులను చులకనగా చూడకు..

Published on Sun, 12/16/2018 - 04:36

సాక్షి అమరావతి: బ్రాహ్మణులు ఏం చేస్తార్లే అనే దురహంకారం, చులకన భావంతో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజమెత్తారు. వారి జంధ్యం పోగులే టీడీపీ ప్రభుత్వానికి ఉరి తాళ్లుగా మారుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ వేధింపులు భరించలేక ఫణికుమారాచార్యులు అనే అర్చకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. గురువు స్థానంలో ఉంచి గౌరవించాల్సిన అర్చకుడిని.. ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కర్నీ మోసం చేశారని దుయ్యబట్టారు. చివరకు భగవంతుడిని కూడా రాజకీయాల కోసం వాడుకునే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడని విమర్శించారు.

మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి అధికారుల ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. అర్చకుల వంశపారంపర్య హక్కుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని పేర్కొన్నారు. వారికి శక్తి ఉన్నంతకాలం అర్చకులుగా కొనసాగవచ్చని కోర్టు తీర్పిచ్చినా పట్టించుకోకుండా.. ప్రభుత్వం బ్రాహ్మణులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పును గౌరవించి వంశపారంపర్య హక్కును కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 76ను అమలు చేస్తూ అర్చకులు వంశపారపర్యంగా కొనసాగే హక్కును కల్పించారని కోన రఘుపతి గుర్తు చేశారు. ఆ జీవో అమలు చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రాహ్మణులెవరూ ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. 

టీడీపీ ప్రయోజనాల కోసమే బ్రాహ్మణ కార్పొరేషన్‌..
టీడీపీ ప్రయోజనాల కోసమే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు తప్ప.. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించేందుకు కాదని కోన విమర్శించారు. ఇప్పటికీ పేద బ్రాహ్మణ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అత్యంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుష్కరాల్లో వందల ఆలయాలను కూల్చివేశారని మండిపడ్డారు. తిరుపతి, శ్రీశైలం, విజయవాడ తదితర ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాల్లో వివాదాలు నెలకొన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యులు సైతం అర్చకులను వేధిస్తున్నారన్నారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక ఇద్దరు అర్చకులు ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రభుత్వ తీరును నిరసించినవారిపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే దేవాలయ వ్యవస్థలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)