వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
‘అందుకే కేటీఆర్, జగన్ను కలిశారు’
Published on Sat, 01/19/2019 - 15:06
పశ్చిమగోదావరి : పదవుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను కలిసినప్పుడు ఏం మాట్లాడనివారు.. ఇప్పుడు కేటీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే మాత్రం ఎందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారంటూ వైఎస్సాఆర్ సీపీ నాయకులు మార్గాని భరత్ ప్రశ్నించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ - కేటీఆర్ కలయిక గురించి తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని స్వాగతించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపించారు. ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరుగుతుంటే.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కలిసి పోరాటం చేయడమే ఫెడరల్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగానే కేటీఆర్, జగన్ను కలిశారన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags