amp pages | Sakshi

రేపటి నుంచి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర

Published on Mon, 01/22/2018 - 12:27

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 23వ తేదీన నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్ప యాత్ర కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ తెలిపారు. జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి పాదయాత్ర మంగళవారం ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగి ఉదయగిరి నియోజకవర్గంతో నెల్లూరు జిల్లాలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఆదివారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ప్రజాసంకల్ప యాత్ర ఏర్పాట్లను జిల్లా నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 23వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగిసి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలోకి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. పార్టీ జిల్లా నేతలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, స్థానికులు అశేషంగా తరలివచ్చి జిల్లాలోకి ప్రవేశించే జగన్‌ పాదయాత్రకు ఘనస్వాగతం పలకటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. 24వ తేదీన నాయుడుపేటకు పాదయాత్ర చేరుకుంటుందని పేర్కొన్నారు. అక్కడ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు. అక్కడి నుంచి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల వరకు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు.

నాయుడుపేట: జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై నాయకులతో చర్చిస్తున్న తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య 
నాయుడుపేటలో ఏర్పాట్ల పరిశీలన
 ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 24వ తేదీన నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుంది. స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తలశిల రఘురామ్‌ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం పార్టీ నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో కలిసి యాత్ర ఏర్పాట్లు, బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?