వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
జనం నుంచి జగన్ను దూరం చేయలేరు
Published on Mon, 10/23/2017 - 18:44
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనం నుంచి దూరం చేయడం ఎవరి తరమూ కాదని వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. సోమవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జనం మధ్య జగన్ ఉండకూడదని, ఆయనను వారి నుంచి వేరు చేయాలనేది తొలి నుంచీ టీడీపీ వ్యవహార శైలిగా ఉందని దుయ్యబట్టారు.
అయితే జగన్ను జనానికి దూరం చేయడం టీడీపీ కాదు కదా, ఎవరి తరమూ కాదన్నారు. జగన్ అంటే వారెంతగా భయపడుతున్నారో వారి వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోందన్నారు. జగన్ ఏ ఉద్దేశంతో పాదయాత్ర తలపెట్టారో అది నిరంతరాయంగా జరుగుతుందని తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ముఖ్యనేతల సమావేశం వాయిదా
సాక్షి, అమరావతి: ఈనెల 25న హైదరాబాద్లో జరగాల్సిన వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ముఖ్య నేతల సమావేశాలు వాయిదా పడ్డాయి.
Tags