రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
263వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
Published on Sun, 09/16/2018 - 08:50
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైఎస్ జగన్.. పెందుర్తి నియోజకవర్గంలోని దువ్వపాలెం క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
అక్కడి నుంచి ఎస్సార్ పురం కాలనీ, దబ్బండ క్రాస్, ఎస్సార్ పురం క్రాస్, సత్తరువు వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్ క్యాంప్ నుంచి బొంతువాని పాలెం, సొంఠ్యాం జంక్షన్, దిబ్బడి పాలెం జంక్షన్ మీదుగా గుమ్మడివాని పాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.
Tags