amp pages | Sakshi

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు 

Published on Mon, 07/08/2019 - 02:17

సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి/విజయవాడ/ఇంద్రకీలాద్రి: రానున్న రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరో చెప్పలేని స్థితిలో ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫ్రంట్‌ ఫ్రంట్‌ అంటూ తిరిగిన 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి టెంటే ఊడిపోయిందని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీలో మాజీ సీఎం కుమారుడు, తెలంగాణలో సీఎం కుమార్తె ఓటమి చెందారన్నారు.

ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభకు పురస్కారం కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి... వచ్చే ఐదేళ్లలో భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, దేశంలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా కిషన్‌రెడ్డితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ భేటీ అయ్యారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటపాటు ఈ భేటీ జరగడం గమనార్హం. మరోవైపు విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న కిషన్‌రెడ్డి... తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రరాష్ట్రాలుగా సమన్వయంతో ముందుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌