పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వెంకయ్య విందుకు కాంగ్రెస్ గైర్హాజరు
Published on Fri, 08/10/2018 - 08:00
సాక్షి, న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం ఇవ్వనున్న అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్డీయే అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ గురువారం ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు పార్లమెంట్ సభ్యులకు మర్యాద పూర్వకంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరుకావట్లేదని ఓ సీనియర్ నేత ప్రకటించారు.
రఫెల్ ఒప్పందం, ఎస్సీ, ఎస్టీ చట్టంపై తమ సభ్యులకు రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, వెంకయ్య నాయుడు సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతల నిర్ణయంపై వెంకయ్య నాయుడు తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
#
Tags