amp pages | Sakshi

ఈ సారి వల్సాద్‌ తీర్పు ఏంటి?

Published on Tue, 05/07/2019 - 02:17

ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.1957 నుంచి 2014 ఎన్నికల వరకు ఇదే జరిగింది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం వస్తుందో నిర్ణయిస్తున్న ఆ నియోజకవర్గం వల్సాద్‌. గుజరాత్‌లో ఉంది. ఒక్కసారి మినహా ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీయే కేంద్రంలో అధికారం చేపట్టింది. ఈ నియోజకవర్గంలో 1967 వరకు కాంగ్రెస్‌ అభ్యర్ధిదే గెలుపు. అప్పటి వరకు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంది. 1971లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ చీలిక వర్గం కాంగ్రెస్‌(ఓ) అభ్యర్థి గెలిచారు.

అయితే, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ఐ కేంద్రంలో అధికారం చేపట్టింది. దీన్ని మినహాయిస్తే మిగతా ఎన్నికల్లో ఎప్పుడూ వల్సాద్‌ జోస్యం తప్పు కాలేదు. అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలో జనతా పార్టీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఇందిరా గాంధీ హత్య దరిమిలా 1984లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించారు. అప్పట్లో రాజీవ్‌ గాంధీ నియోజకవర్గ పరిధిలోని లాల్‌ దంగ్రిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బంపర్‌ మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టింది. 1989లో ఈ నియోజకవర్గం జనతాదళ్‌కు ఓటు వేసింది. ఆ పార్టీ నేత వీపీ సింగ్‌ ప్రధాని అయ్యారు. 1991 ఎన్నికల సమయంలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో వల్సాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పటేల్‌ గెలిచారు. పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 1996,1998,1999 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం బీజేపీకి పట్టం కట్టింది. మూడు సార్లు కూడా బీజేపీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

2004 ఎన్నికల్లో సోనియా గాంధీ లాల్‌ దంగ్రీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించింది. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 2014లో మోదీ హవా ప్రభావం ఇక్కడ కూడా పడింది. వల్సాద్‌ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ మొదటి సారి లోక్‌సభలో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వల్సాద్‌ ను మొదట్లో బల్సార్‌గా పిలిచేవారు. పునర్విభజన తర్వాత దీనిపేరు వల్సాద్‌గా మారింది. ఇక్కడి 16 లక్షల ఓటర్లలో 11 లక్షల మంది ఎస్‌టీలే. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు ఎస్టీలకు రిజర్వుచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున జితు చౌదరి, బీజేపీ నుంచి కెసీ పటేల్‌ పోటీ చేస్తున్నారు.

Videos

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)