amp pages | Sakshi

ఏ సర్వే చెప్పలేదు

Published on Mon, 01/06/2020 - 03:16

సూర్యాపేట : సీఎం కేసీఆర్‌ మాటలు ఓ బూటకమని.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఏ సర్వే చెప్పలేదని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఆ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి ఇక లేదని విమర్శించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఎన్నికలంటే కాంగ్రెస్‌ పార్టీకి భయం లేదని, కాంగ్రెస్‌కు సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దోచుకున్న సొమ్ముతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లోకి వస్తే.. ప్రజాబలంతో కాంగ్రెస్‌ పార్టీ వస్తుందన్నారు. ఆరు సార్లు ఎన్నికల్లో గెలిచిన సత్తా తనకుందని, పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలకు హితవు పలికారు. ఎన్నికలంటే తనకు భయమని టీఆర్‌ఎస్‌ గ్లోబెల్‌ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలను ఆపేందుకు కోర్టుకు వెళ్లలేదని, గడువు కావాలని మాత్రమే వెళ్లామని తెలిపారు. ఈ నెల 6న కోర్టులో విచారణ ఉందని.. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన మరునాడే నామినేషన్లు ఎలా వేస్తారని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. సూర్యాపేటలో రోడ్ల విస్తరణతో మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడి ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉన్న వారికి ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని, వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని తెలిపారు. దీనిపై రెండు మూడ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరుతామని చెప్పారు. ఈనెలాఖరులోపు ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకుంటే ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

ఒక్క హామీని నెరవేర్చలేదు...
టీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, దీంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఏఐసీసీ కార్యదర్శి సలీం ఆహ్మద్‌ అన్నారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపల్‌ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయన్నారు. వారి వెంట మాజీ మంత్రి ఆర్డీఆర్, ప్రేమ్‌లాల్, పటేల్‌ రమేశ్‌రెడ్డి, చెవిటి వెంకన్న ఉన్నారు. 

Videos

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)