ఉత్తమ్‌ ఇంటి వద్ద సంబరాలు

Published on Sun, 01/07/2018 - 02:23

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షులను కొనసాగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శనివారం రాత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకొని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఉత్తమ్‌ కు çపుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు రవి, గుడూరు నారాయణ రెడ్డి, లక్ష్మణ్‌ గౌడ్, యూత్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శారద, రంగారెడ్డి జిల్లా నాయకులు క్యామ మల్లేశం, బి.లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వరంగల్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ