amp pages | Sakshi

బడ్జెట్‌ : తెలంగాణకు దక్కినవేంటి?

Published on Sat, 02/01/2020 - 19:39

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవని ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించకపోగా.. కనీసం విభజన హామీలను సైతం నెరవేర్చలేదని పెదవి విరిశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు కేంద్రానికి విజ‍్క్షప్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు లక్ష కోట్లతో నిర్మించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. కానీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో దాని ప్రస్తావనే లేదు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు తీవ్ర నిరాశ చెందారు. (బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం)

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇచ్చిన హామీని విస్మరిస్తూ.. రెండు బడ్జెట్‌ సమావేశాలు ముగిసినా.. కేంద్రం నుంచి ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నా.. ముందడుగు మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్‌ నేతలు కోరుతున్నారు. అలాగే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినప్పటికీ.. కేంద్రం విడుదల చేయడంలేదని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, తమపై ఇంత వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఏపీకి అందని సీతమ్మ వరాలు..)

అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌ సమావేశాల్లో పలు అంశాలను కేంద్రానికి ప్రతిపాదిస్తోంది. వాటిలో కాజీపేట్‌ రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నిజామాబాద్‌ పసుపు బోర్డుతో పాటు కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి అంశాలను ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. గత బడ్జెట్‌లో వీటికి మొండిచేయి చూపడంతో.. ఈ సారైనా కేంద్ర కరునిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ విత్తమంత్రి ప్రసంగంలో మాత్రం వాటి ప్రస్తవన లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర నుంచి నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్‌ ఇ‍ప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు పెద్దగా లేకపోవడంతో.. తెలుగు ప్రజలు పూర్తి నిరాశలో ఉన్నారు. (కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)