Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
Breaking News
బీజేపీలో చేరికపై టీడీపీ నేతల మంతనాలు
Published on Fri, 05/31/2019 - 13:04
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఎక్కువగా ఆసక్తిచూపుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో నాలుగు ఎంపీ సీట్ల గెలుపుతో తెలంగాణలో బీజేపీకి ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ నేతలు ఈ.పెద్దిరెడ్డి, చాడా సురేశ్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. బీజేపీలో చేరడంపై కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు.
ప్రస్తుతం తెలుగుదేశం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా పెద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షడిగా మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కూడా పార్టీ పుంజుకుంటుండటంతో టీటీడీపీ నేతలు ఎక్కువగా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Tags