amp pages | Sakshi

ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా?

Published on Fri, 06/07/2019 - 02:43

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నీచంగా, వికృతంగా, గలీజు రాజకీయాలు చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రహస్య ప్రదేశంలో విలీన ప్రక్రియ పిటిషన్‌ తీసుకొని, మూడు గంటల్లోనే ప్రక్రియను ముగించారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా అని ప్రశ్నించారు. అగ్రకుల అహంకారంతో అనైతికంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న భ్రష్టు రాజకీయాలను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. గురువారం రాత్రి విలీన ప్రక్రియకు సంబంధించి బులెటిన్‌ వెలువడిన అనంతరం ఆయన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలతో కలసి గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని చూడటం నీచమన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని ఎంత తొక్కితే అంతగా బలపడతామని, చరిత్ర ఇదే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నటికైనా టీఆర్‌ఎస్‌ను గద్దె దించేది కాంగ్రెస్‌ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టిన స్పీకర్‌... ఫిరాయింపు ఎమ్మెల్యేలు విలీన లేఖ ఇచ్చిన గంటల్లోనే సానుకూల నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఉదయం నుంచి స్పీకర్‌ను సంప్రదించేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. కాంట్రాక్టుల సొమ్ము చెల్లిస్తామని ఉపేందర్‌రెడ్డిని, రూ. 26 కోట్ల పరిహారం ఇస్తామని హర్షవర్ధన్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న టీఆర్‌ఎస్‌... రోహిత్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసులు పెడతామని బెదిరించి పార్టీలోకి రప్పించుకుందని ఉత్తమ్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ కుటుంబ సభ్యులు చేస్తున్న అక్రమాలను శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రశ్నించ కూడదని ఫిరాయింపులు చేస్తున్నారా లేక కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు పంచాయితీ వస్తే ఎమ్మెల్యేలు హరీశ్‌ దగ్గరకు వెళ్తారన్న భయంతో ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ విలీన ప్రక్రియపై హైకోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ వెలువడే తీర్పునుబట్టి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలు జరిగాయో రుజువులతో సహా అక్కడే నిరూపిస్తామన్నారు. విలీన ప్రక్రియకు నిరసనగా ఈ నెల 8న ఇందిరా చౌక్‌లో భట్టి విక్రమార్క నేతృత్వంలో సేవ్‌ డెమోక్రసీ పేరుతో 36 గంటలపాటు దీక్ష చేస్తామని వెల్లడించారు. 

ప్రజాస్వామ్యం ఖూనీ: భట్టి 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం నేరమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని, ఒకవేళ పార్టీ మారితే వారిని అనర్హులుగా ప్రకటించాలి తప్ప పార్టీ మారిన వారి నుంచే విలీనపత్రం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విధానం యావత్‌ దేశం పాకితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమయం ఇవ్వకుండా, అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించాలని స్పీకర్‌ ఆదేశించడం దారుణమన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడానికే విలీనం చేశారని దుయ్యబట్టారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)