అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిజామాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
Published on Tue, 06/04/2019 - 14:01
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి బెంగరి సత్తెమ్మ విజయం సాధించారు. అయితే, గెలుపొందిన సత్తెమ్మను టీఆర్ఎస్ శిబిరానికి తరలించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆమె తరలింపు విషయాన్ని గుర్తించిన బీజేపీ శ్రేణులు వెంటనే అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట అనంతరం బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి బెంగరి సత్తెమ్మ ఇంటికి వెళ్లిపోయారు.
#
Tags