amp pages | Sakshi

కరోనా పరీక్షల్లో రాష్ట్రం విఫలం

Published on Fri, 05/29/2020 - 03:08

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షలు అతి తక్కువగా చేసిన రాష్ట్రం తెలంగాణ అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైద్య పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రోజుకు 5 వేల పరీక్షలు చేస్తామని వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారని, ఇప్పుడు అంత సంఖ్యలో పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదో స్పష్టం చేయాలన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టి కాయలు వేసినా ప్రభుత్వానికి సోయి రావడం లేదన్నారు.

రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని, వలస కార్మికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించలేకపోయిందన్నారు.  కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు 50 లక్షల మెట్రిక్‌ టన్నులు కూడా కొనుగోలు చేయలేదన్నారు. కొన్ని రకాల విత్తనాలు అమ్మాలి, మరికొన్ని రకాల విత్తనాలు అమ్మొద్దని ఆదేశాలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ ‘స్పీక్‌అప్‌ ఇండియా’పేరిట సామాజిక మాధ్యమాల్లో పోరాటం చేస్తున్నదన్నారు. ఈ పోరాటం విజయవంతం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. 27 వేల మంది కేడర్‌తో మాట్లాడి, ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఆన్‌లైన్‌ పోరాటం చేపట్టినట్లు తెలిపారు.

వలస కూలీలకు బస్సు ఏర్పాటు: వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారైల ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలను హైదరాబాద్‌ నుంచి పంపించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. గురువారం  గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఎన్నారై సెల్‌ అధ్యక్షుడు వినోద్‌ తదితరులు జెండా ఊపి బస్సు ప్రారంభించారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌