amp pages | Sakshi

ముందస్తు ఎన్నికలు మరింత ముందుకు..!

Published on Sat, 02/03/2018 - 15:58

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం పట్ల కేంద్రంలోని పాలకపక్షం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ఆందోళన మొదలైంది. బీజేపీ పట్లనున్న వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ మండల్‌ గఢ్‌ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా అల్వర్, అజ్మీర్‌ లోక్‌సభ స్థానాలను భారీ మెజారిటీతో కైవసం చేసుకొందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వ్యతిరేకత మరింత పెరగక ముందే, అంటే ఈ ఏడాదే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లడం మంచిదని బీజేపీ మేధావులు యోచిస్తున్నట్లు తెల్సింది. పార్లమెంట్‌లో గురువారం నాడు కేంద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఒక్క ఎన్నికల తేదీలను తప్ప ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రకటించారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పట్టును కోల్పోతుందని గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి తెలియజేయడంతో బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన విషయం తెల్సిందే. గిట్టుబాటు ధరలు లేక గతేడాది రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం కూడా బడ్జెట్‌లో రైతులకు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం.

బడ్జెట్‌ కేటాయింపులను ప్రచారం చేసి గ్రామీణ ప్రాంతాలను ఆకర్షిస్తామంటే సరిపోదని, సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లడం మంచిదని పార్టీ సీనియర్లు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ కూడా ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతున్నారని గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం అవుతున్న విషయం తెల్సిందే.

‘2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి ప్రజలు పార్టీకి ఓటేశారు. ఈ సారి చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినందున ఆయన పిలుపు అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిది’  అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు.

‘రైతుల సంక్షేమం కోసం భారీ పథకాలు ప్రకటించినంత మాత్రాన రైతులు ఓట్లు వేస్తారని భావించలేం. ఆ పథకాల ప్రయోజనాలు సిద్ధించినప్పుడు మాత్రమే రైతులు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు. ఆ ప్రయోజనాలు వారికి దక్కాలంటే మరింత కాలం నిరీక్షించాల్సి ఉంటుంది’ మరో బీజేపీ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)