amp pages | Sakshi

సార్వత్రిక ఎన్నికలకు.. షెడ్యూల్‌ ఫిబ్రవరిలోనే!

Published on Thu, 01/24/2019 - 00:51

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: 2019 సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు, నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రాల ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సంప్రదింపులు, సమావేశాలు జరిపిన ఈసీ.. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోనూ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేసింది. ఫిబ్రవరి మూడో వారంలో షెడ్యూల్‌ విడుదల చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది.

మొత్తం ఐదు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. మునుపటి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ గజిబిజిగా ఉండటంతో పాటు ఎన్నికల ప్రక్రియ (షెడ్యూల్‌ మొదలుకుని ఫలితాలు వచ్చేవరకు) ఎక్కువకాలం సాగడంపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సుదీర్ఘమైన ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనేక విషయాల్లో అచేతనంగా ఉండాల్సి వస్తుందనే ఫిర్యాదు కూడా వచ్చింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ నెలరోజుల్లో మొత్తం ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 2014లో మార్చి6న మొదలైన ప్రక్రియ రెండున్నర మాసాలపాటు సాగింది. ఈ సారి 55–60 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యుల్‌ ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
 
ఏప్రిల్‌ మొదటి వారంతో మొదలై.. 
సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో షెడ్యుల్‌ విడుదల చేయడం దాదాపుగా ఖరారైందని, తేదీ ఎప్పుడనేది ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందని విశ్వసనీయ అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంత పెద్ద రాష్ట్రమైనా ఈసారి కనిష్టంగా రెండు, గరిష్టంగా మూడు దశల్లో పోలింగ్‌ పూర్తి చేయాలని భావిస్తోంది. 2014లో బీహార్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఐదు నుంచి ఏడు దశల పాటు ఎన్నికలు నిర్వహించడం ద్వారా పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని.. ఆయా రాష్ట్రాల పభ్రుత్వాలు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో ఏప్రిల్‌ మొదటివారంలో ప్రారంభించి ఈసారి 5 లేదా 6 దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని (ఏప్రిల్‌ చివరి వరకు) నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి రెండు విడతల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, జమ్ముకాశ్మీర్‌తో పాటు ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేసేలా షెడ్యుల్‌ రూపొందిస్తోంది. 

తెలంగాణ, ఏపీల్లో.. 
గతంలో మాదిరిగానే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, మూడో వారంలో ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో పూర్తి చేసేందుకు వ్యూహరచన జరుగుతోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఒకే దశలో పూర్తి చేస్తారు. రెండో దశలో తెలంగాణ, తమిళనాడు, మూడో దశలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక ఉండొచ్చని అధికారవర్గాల సమాచారం.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)