amp pages | Sakshi

‘ముందస్తు’పై కేసీఆర్‌ జవాబు చెప్పాలి 

Published on Mon, 10/15/2018 - 01:49

ఆమనగల్లు: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర గణాంక, పథకాల అమలు శాఖ మంత్రి డీవీ సదానందగౌడ డిమాండ్‌ చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్‌ ఓటమి భయంతోనే ముందస్తుకు సిద్ధమయ్యారన్నారు. త్రిపుర మాదిరిగానే ఈ రాష్ట్రంలోనూ బీజేపీ అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమావ్యక్తం చేశారు. ఆమనగల్లులో ని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన సాగించారని ఆరోపించారు. బీజేపీకి ఆదరణ పెరగడంతో భయపడి కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారన్నారు. సచివాలయానికి వెళ్లకుండా పాలన సాగించిన మొదటి సీఎం కేసీఆరే కావొ చ్చని వ్యాఖ్యానించారు. సీఎంను సహచర మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కలవలేక పోతున్నారని, ఒవైసీ సోదరులు, కేటీఆర్, కవితలకు మాత్రం తలుపులు బార్లా తెరిచి ఉంచారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు.  

సొమ్ము కేంద్రానిది.. సోకు కేసీఆర్‌ది.. 
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిందని సదానంద గౌడ చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతో కేసీఆర్‌ తానే నిధులు తెచ్చి ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నారని, సొమ్ము కేంద్రానిదైతే సోకు కేసీఆర్‌ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూ.5,200 కోట్లతో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించామని, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో రూ.165 కోట్లతో ఫుడ్‌పార్క్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.రాష్ట్రంలోని 7.92 లక్షల మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్‌ బీమాను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం రూ.4,265 కోట్లను రాష్ట్రానికి కేటాయించిందని గుర్తు చేశారు.    

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)