amp pages | Sakshi

ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తుంది

Published on Fri, 11/30/2018 - 02:04

జహీరాబాద్‌/సాక్షి, వనపర్తి /నాగర్‌కర్నూల్‌: కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో దివంగత ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. గురువారం  సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు.  ఎన్టీ ఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు.  ప్రస్తుతం  చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, ఇది అపవిత్రమైన కలయిక అని రాజ్‌నాథ్‌ అభివర్ణించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సరిగా అభివృద్ధి చెందక పోవడానికి ఇరు రాష్ట్రాల నేతల మధ్య విభేదాలే కారణమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ.లక్ష 15వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపడం లేదని, ఇచ్చిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా చెప్పడం లేదని విమర్శించారు.  

కేసీఆర్‌ చేసిందేమీ లేదు
కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలు ఏమీ లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని  చెప్పారు. కేంద్రం పంటలకు గిట్టుబాటు ధర పెంచిందని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధాని ముందుకెళ్తున్నారన్నారు.  మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది సరైన విధానం కాదన్నారు. ఎవరిని కొట్టి ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు.   

ఆశ్చర్యపోయా..
కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని విని ఆశ్చర్యపోయాయనని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో బీజేపీ అభ్యర్థి దిలీపాచారి నిర్వహించిన ‘మార్పు కోసం బీజేపీ’సభతో పాటు వనపర్తిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో బీజేపీ అభ్యర్థి అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభల్లో ఆయన  మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం టీడీపీ చేసిన పెద్ద తప్పిదమన్నారు. మోదీని అధికారంలోకి రాకుండా చేసేందుకే ఈ అపవిత్ర కలయిక అని ధ్వజమెత్తారు. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్