వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాపై ‘కాషాయం’ పులిమే ప్రయత్నం: రజినీ
Published on Sat, 11/09/2019 - 03:50
సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ కొట్టి పారేశారు. కమలదళంలో చేరనున్నట్లు తనపై కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ‘బీజేపీలో చేరాలంటూ నన్నెవరూ ఆహ్వానించలేదన్నది సుస్పష్టం. తిరువళ్లువర్(ప్రాచీన తమిళ కవి)పై జరిగినట్లే నాపై కూడా బీజేపీ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, తిరువళ్లువర్ కానీ, నేను కానీ ఆ వలలో పడబోం’అన్నారు. హిందూ మున్నానీ నేతలు తిరువళ్లువర్ విగ్రహానికి కాషాయ రంగు వస్త్రం కప్పడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు నాపై బీజేపీ మనిషినంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించాయి. కానీ, అది ఎంతమాత్రం నిజం కాదు’అని అన్నారు.
#
Tags