amp pages | Sakshi

ముందుగా ‘పారదర్శకత’ కావాలి!

Published on Tue, 08/28/2018 - 16:05

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సంస్కరణలపై సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం ప్రధానంగా పోలింగ్‌లో ఈవీఎంల విధానానికి స్వస్తి చెప్పి మళ్లీ బ్యాలెట్‌ విధానానికి రావాలని ప్రతిపాదించాయి. పాలకపక్షంలోని శివసేన సహా 70 శాతం పార్టీలు బ్యాలెట్‌ విధానానికే స్వాగతం పలికాయి. మళ్లీ బ్యాలెట్‌ విధానం ఎందుకని వాదించిన పార్టీలు కూడా ఈవీఎంలను మరింత పటిష్టం చేయాలని, లోపరహితంగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చాయి. గత వరుస ఎన్నికల్లో ఓటమి మింగుపడని బీజేపేతర ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్‌ విధానాన్ని డిమాండ్‌ చేస్తున్నాయనే విషయం ప్రజలకు తెల్సిందే. ఏ సాంకేతిక పరిజ్ఞానానికి సరైన భద్రతలేని భారత్‌లాంటి వర్ధమాన దేశంలో ప్రతిపక్షాల విమర్శలను, సూచనలను ఎన్నికల కమిషన్‌ తీవ్రంగానే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన కొన్ని ఎన్నికల్లో పలు ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో ఇది మరింత అవసరం.

అఖిలపక్ష సమావేశం అనగానే ముందుగా ప్రధాని మోదీ జమిలి ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతారని అందరు ఆశించారు. ఎందుకోగానీ ఆయన ఆ ప్రస్థావననే తీసుకరాలేదు. ఎన్నికల సందర్భంగా పార్టీలు పెడుతున్న ఖర్చులపై కూడా పరిమితి ఉండాలన్న విషయం కూడా చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో అభ్యర్థులు పెడుతున్న ఖర్చుపైనే పరిమితులు ఉన్నాయి. పార్టీకి కూడా పరిమితులు విధిస్తే అభ్యర్థులు తమ ఖర్చులను పార్టీ కోటాలో వేస్తారన్న ఉద్దేశంతో నాడు పార్టీల ఖర్చుపై పరిమితులు విధించలేదు. ఎక్కువ మంది అభ్యర్థులు, పాలకపక్ష అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చుచేస్తున్నారని, అయితే వాటి వివరాలను వెల్లడించడం లేదన్నది ప్రజలందరికి తెల్సిందే. ఇప్పుడు పార్టీకి పరిమితులు విధించినా రేపు అదే జరుగుతుందని, పార్టీలు పరిమితికి మించి ఖర్చు పెట్టి, లెక్కలను పరిమితి లోపల చూపిస్తాయని తెలిసిందే. అందుకని ఆ పరిమితి విధానం వల్ల పెద్దగా లాభం లేదు.

పార్టీలకు విరాళాల విధానం మరింత పారదర్శకంగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అందులో న్యాయం ఉంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానం సవ్యంగా లేదు. అది పాలకపక్షానికి అనుకూలంగా ఉంది. పారదర్శకతా లేదు. అందులో తక్షణం సంస్కరణలు అవసరం. అలాగే ఆరు జాతీయ పార్టీలు ప్రజా స్క్రూటినీకి వీలుగా ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకరావాలని 2013లో కేంద్ర సమాచార కమిషనర్‌ సూచించారు. నాడు దాన్ని నిర్లక్ష్యం చేసిందీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే అయినందున ఆ అంశాన్ని తీసుకరావాలంటే కాంగ్రెస్‌కు ఇబ్బందే ఉంటుందిగానీ పారదర్శకత కావాలంటే ఆ సూచనను అమలు చేయాల్సిందే. అందుకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందే.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)