రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
అది మర్యాద పూర్వక పలకరింపే
Published on Sun, 06/24/2018 - 04:55
సాక్షి, అమరావతి/పెదకాకాని: ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం నాటి తన భేటీపై జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ భేటీతో ఏదో జరిగిపోతుందని ఊహించుకోవద్దంటూ పేర్కొన్నారు. ‘‘టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ రకాల ప్రజా కార్యక్రమాల్లో తారసపడుతుంటారు. అలాంటి సమయాల్లో మర్యాద పూర్వకంగా పలకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం నా విధి. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు రాజకీయ పార్టీల నాయకులు, ఇతరులు ఏదో జరిగిపోతోందంటూ ఊహించుకోవద్దు’’ అని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
శ్రీ భూసమేత శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పవన్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ దంపతులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న శ్రీ భూసమేత శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి వారిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో పవన్కళ్యాణ్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. పవన్కళ్యాణ్ దంపతులకు గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహభాషణ, దివ్య ఆశీస్సులు అందజేశారు.
దశావతార వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్కళ్యాణ్ దంపతులు
Tags