‘టీడీపీలో చేరలేదు.. మద్దతే ఇస్తున్నా’

Published on Wed, 10/18/2017 - 01:40

సాక్షి, అమరావతి: తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని, మద్దతు మాత్రమే ఇస్తున్నానని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును ఆమె మంగళవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను వైఎస్సార్‌సీపీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారో తెలియదని, తన భర్త వైఎస్సార్‌సీపీతో విభేదించినా.. తాను మనస్ఫూర్తిగానే పార్టీకోసం పనిచేశానని చెప్పారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారో విశ్లేషించేంత అనుభవం తనకు లేదని వ్యాఖ్యానించారు.

తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారంపై అందరికీ స్పష్టత ఇవ్వడానికే బహిరంగంగా వచ్చి బాబుకు మద్దతు తెలిపానని రేణుక చెప్పారు. కాగా, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులవుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇంకా కొంతమంది త్వరలో టీడీపీలోకి వస్తారని వ్యాఖ్యానించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ