amp pages | Sakshi

అలా చేస్తే హోదా కచ్చితంగా వస్తుంది

Published on Mon, 07/23/2018 - 11:55

సాక్షి, విజయవాడ : టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని, ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేత పైలా సోమినాయుడితో కలిసి సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఉద్యమంలో టీడీపీ కూడా భాగస్వామి కావాలని అన్నారు.

వైఎస్సార్‌సీపీ రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యానించారు. మోదీ పార్లమెంట్‌ సాక్షిగా హోదా విషయంలో విషయంలో మోసం చేశారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కరే మొదటి నుంచి చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు.

అవిశ్వాసం సందర్భంగా టీడీపీ, బీజేపీ చేసిన ద్రోహానికి నిరసనగా రేపు(ఈ నెల 24) బంద్‌కు జగన్‌ పిలుపునిచ్చారని, టీడీపీ, బీజేపీ చేసిన అన్యాయానికి నిరసనగా అందరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు. వైఎస్సార్‌ హయాంలో విద్యా విప్లవం వచ్చిందని.. సామాన్యులను డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్‌ అని కొనియాడారు. అలా చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావాలంటే హోదా రావాలని అన్నారు.  ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా తాము మద్ధతిచ్చామని, అలాగే భవిష్యత్‌లో కూడా మద్ధతు ఇస్తామని తెలిపారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్ధతు ఇవ్వాలని కోరారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)