amp pages | Sakshi

గరీబోళ్ల రాజ్యం రావాలి

Published on Tue, 07/03/2018 - 01:42

సాక్షి, జగిత్యాల/ జగిత్యాల టౌన్‌: తెలంగాణలో గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల రాజ్యం రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆకాంక్షించారు. బీజేపీ జన చైతన్యయాత్ర సోమవారం జగిత్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్‌ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ద్రోహులతో జత కలసి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్‌.. ఇచ్చిన మాట తప్పారని, నాడు ఉద్యమం కోసం ఆత్మహత్యలు జరిగితే.. నేడు ఉద్యోగాల కోసం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పిచ్చుకగూళ్లుగా అభివర్ణించిన కేసీఆర్‌.. ఎన్ని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పునాదులకే పరిమితమయ్యా యని విమర్శించారు. ఎంపీ కవిత ప్రాతి నిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చేసేందుకు పనిలేక ఎంతోమంది గల్ఫ్‌బాట పట్టారని గుర్తుచేశారు. గల్ఫ్‌ ఏజెంట్ల మోసాల బారిన పడి అక్కడి జైళ్లలో మగ్గుతున్న వారిని విడిపించడంలో కవిత ఏ చొరవ తీసుకోవడం లేదని ఆరోపించారు. అదే తెలంగాణ చిన్నమ్మ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ గల్ఫ్‌ జైళ్లలో బందీలను విడిపిస్తున్నారని పేర్కొన్నారు. మూతబడ్డ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వంద రోజుల్లో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఎందుకు తెరిపించలేక పోయిందని ప్రశ్నించారు. ఓ పక్క చేనేత కార్మికులను ప్రోత్సహిస్తామంటూ గొప్పలు చెబుతూనే.. బతుకమ్మ పేరిట సూరత్‌ నుంచి చీరలు కొనుగోలు చేసి ఈ ప్రాంత చేనేత కార్మికుల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ వస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌.. వారిని మోసం చేసి సీఎం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగినా పట్టించుకునే పాపాన పోలేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్డ్‌ చేయలేదో చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలన్నందుకు 14 వేల రేషన్‌ డీలర్లను రోడ్డుపాలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. మజ్లిస్‌ పార్టీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరవేసింది టీఆర్‌ఎస్‌యేనని చెప్పారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయమే బీజేపీ ధ్యేయమని, వాజ్‌పేయి హయాంలో ముస్లింను.. మోదీ హయాంలో దళితుడిని రాష్ట్రపతిగా చేయడమే ఇందుకు నిదర్శమన్నారు  

తెలంగాణలోనూ అదే సంప్రదాయం 
‘ఇప్పటికే ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో కాంగ్రెస్‌ కంచుకోటలన్నింటినీ బీటలు వారిం చాం. ఇదే సంప్రదాయం త్వరలోనే తెలంగాణలోనూ కొనసాగిస్తాం’ అని లక్ష్మణ్‌ అన్నారు.  కాంగ్రెస్‌ దేశంలో అన్ని పార్టీలను కలుపుకుంటూ కౌరవ సైన్యాన్ని తయారు చేస్తోందని, దాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీ పాండవులకు ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో స్కాంలు జరిగితే టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)