amp pages | Sakshi

పార్టీ తర్వాతే ఫండ్‌

Published on Sat, 11/18/2017 - 07:30

రాజకీయపార్టీ స్థాపన కోసం ప్రజల నుంచే ఫండ్‌ వసూలు చేస్తానని ప్రకటించిన నటుడు కమల్‌హాసన్‌ తాత్కాలికంగా మనసు మార్చుకున్నారు. ముందు పార్టీ, ఆ తరువాతే ఫండ్‌ అంటున్నారు. ఇప్పటి వరకు అభిమానుల నుంచి పొందిన రూ.30 కోట్లను వెనక్కు ఇచ్చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.

సాక్షి  ప్రతినిధి, చెన్నై : కమల్‌ రాజకీయ ప్రవేశం ఖాయమైపోగా పార్టీ పేరు, జెండా, అంజెండాలకు రూపకల్పన జరుగుతోంది. తెరవెనుక సన్నాహాలు చేసుకుంటూనే వచ్చేనెల నుంచి ప్రజల ముందుకు వచ్చేందుకు కమల్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీని స్థాపించడం అంటే మాటలు కాదు, ఒక సినిమా తీయడానికే కనీసం ఏడాది పడుతున్న పరిస్థితిలో రాజకీయాల్లోకి ఆచీతూచీ అడుగువేయాల్సి ఉందని కమల్‌ తన జన్మదినం రోజున చెప్పారు. ఆర్థికబలం లేకుండా, అవినీతికి తావులేకుండా పార్టీని నడపడం ఎలా సాధ్యమని గతంలో కమల్‌ను మీడియా ప్రశ్నించినపుడు ‘ ప్రజల నుంచి పార్టీ ఫండ్‌ను సేకరిస్తాను’ అని చెప్పారు. కమల్‌ చేసిన ఈ ప్రకటనతో తీవ్రంగా స్పందించిన ఆయన అభిమాన, సంక్షేమ సంఘాలు సుమారు రూ.30 కోట్లను సిద్ధం చేయడంతోపాటు ఆయన ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది.

విరాళాలు వెనక్కి..
అయితే ఈ సొమ్మును స్వీకరించేందుకు కమల్‌ ఇష్టపడలేదు. తన వద్దకు చేరిన సొమ్మును ఎవరు చెల్లించారో తెలుసుకుని వారికే తిరిగి అప్పగించాలని నిర్ణయించకున్నట్లు కమల్‌ శుక్రవారం తెలిపారు. తాను నటుడైన తరువాత గత 37 ఏళ్లకాలంలో అభిమానులు కోట్లాది రూపాయలను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుచేశారని తెలిపారు. పార్టీకి అవసరమైన ఆర్థికసహాయాన్ని ప్రజలే అందిస్తారని తాను ప్రకటిస్తే అభిమానులు అందజేస్తారని మీడియాలో వచ్చిందని ఆయన అన్నారు. ఇది తానే ఇచ్చిన పిలుపుగా భావించిన అభిమానులు భారీ ఎత్తున నిధులు సేకరించి తనకు పంపినట్లు చెప్పారు. ఇలాంటి అయోమయ పరిస్థితులను చక్కదిద్దేందుకు తాను సిద్ధమయ్యానని, అభిమానుల నుంచి వచ్చిన సొమ్మును వారికే వెనక్కి ఇచ్చేయాలని తన సిబ్బందిని ఇప్పటికే ఆదేశించా, అందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఉత్తరాలు, డబ్బు రావడం ప్రారంభమైంది, అయితే ముందుగానే నిధులు స్వీకరించడం చట్టవిరుద్ధం అవుతుందని నాకు తెలుసు, ఇలాంటి అపవాదులకు తావివ్వనని అన్నారు.

అయితే ప్రస్తుతం తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిధులు స్వీకరించనని అర్థంకాదు, పార్టీనే లేనపుడు డబ్బును ముట్టుకోకూడదని చెప్పారు. ప్రస్తుతం వెనక్కు చేస్తున్న సొమ్ము నాదేనని భావించి భద్రం చేయండి, తాను తిరిగి కోరేలోగా ఖర్చయితే ప్రాప్తం లేదని సరిపెట్టుకుంటాను అన్నారు. అభిమానులు నిధులు పంపిన రోజునే పార్టీ ఆవిర్భవించినట్లుగా భావిస్తున్నానని అన్నారు. ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం ఒక వ్యక్తిగా తాను సమకూర్చుకోలేను, అందుకే ప్రజలను కోరానని చెప్పారు. రాజకీయ నాయకునిగా తన లక్ష్యం గురించి త్వరలో అభిమానుల సమక్షంలో ప్రకటిస్తాను, ఈలోపు రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు.

Videos

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)