రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబు ఆలోచనలపైనే బీజేపీ భవిష్యత్తు: జేసీ
Published on Sat, 09/14/2019 - 11:16
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలపైనే ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల కారణంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. శనివారం కడపలో జేసీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలైందన్నారు. ఆ ప్రభంజనం ఎక్కువైనా లేదా తక్కువైనా కావచ్చునని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరోక్ష పాత్ర ఎంతైనా ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
#
Tags