amp pages | Sakshi

‘కార్పొరేట్‌’ విరాళాలు తీసుకోం

Published on Sun, 04/22/2018 - 02:00

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద, పెద్ద కాంట్రాక్టర్లు, కార్పొరేట్‌ సంస్థల నుంచి విరాళాలు తీసుకోమని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, టీజేఎస్‌ నేతలు అంబటి శ్రీని వాస్, చింత స్వామి, గోపాలశర్మ, భైరి రమేశ్‌ తదితరులతో కలసి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

ప్రజల సొమ్మును పెద్దఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించొ ద్దని నిర్ణయించినట్టు చెప్పారు. సామాన్యులు, స్థానిక కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమల యజమానుల నుంచి మాత్రమే చందాలు వసూ లు చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్త రాజకీయ ఒరవడికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఈ నెల 29న సరూర్‌నగర్‌లో జరిగే జన సమితి ఆవిర్భావ సభకు అన్ని అనుమతులు లభించాయని, దీని కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సభ నిర్వహణ కోసం 12 కమిటీలు కృషి చేస్తున్నాయన్నారు. సభా నిర్వహణ నిమిత్తం వాలంటీర్లకు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. పార్టీపై ప్రత్యేక పాటలు రూపొందించినట్టు తెలిపారు. సభకు వచ్చే ప్రతిరైతు ఒక నాగలి కర్రుముక్క తీసుకురావాలని, దీనితో అమరుల స్మృతి చిహ్నాన్ని నిర్మిస్తామని అన్నారు.

ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అధికారంలో ఉన్నవారు పట్టించుకోవడం లేదని.. అన్ని వర్గాలు పాలకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కోదండరాం అన్నారు. రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే అవకాశం లేకుండా చేయడం చట్ట వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. మీడియాపై అసహనం ప్రదర్శించడం మంచిదికాదన్నారు.

సినీ పరిశ్రమపై ఆసక్తితో వచ్చిన మహిళను లోబరుచుకోవడం మంచిపరిణామాలు కాదని, వీటిని ఖండించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ నెల 29న మూడు గంటలకు సభ ప్రారంభం అవుతుందని, 3 నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 6.40కి ప్రభుత్వ నిర్బంధం, పాలకుల వైఫల్యాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తామన్నారు.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌