చంద్రబాబుపై మాధవీలత విమర్శలు

Published on Tue, 05/08/2018 - 20:40

సాక్షి, హైదరాబాద్ : ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సినీనటి మాధవీలత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎన్నో సార్లు మాట మార్చారని మండిపడ్డారు. హోదా కంటే ఎక్కువగా, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు ఇచ్చిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఎవరైనా లెక్కలు చెప్పాల్సిందేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. లారీ ఇసుక ఎత్తేసినందుకు 5లక్షల రూపాయల బిల్లుపెట్టారంటూ మండిపడ్డారు. 

తన పదో తరగతి నుంచే పవన్‌ అంటే ఇష్టమని చెప్పిన మాధవీలత, బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆపార్టీలో చేరినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో పనిచేయాలని ఉందని తన కోరికను బయటపెట్టారు. అంతేకాదు పోటీ గురించి మాట్లాడుతూ పార్టీ అవకాశం ఇస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానంటూ, తన మనసులోని మాటను చెప్పారు. తనకు ఎలాంటి ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేవని, తమ కుటుంబంలో చాలామంది ఆర్మీలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ