amp pages | Sakshi

‘బాబు లేఖలో పేర్కొన్నవన్నీ అసత్యాలు’

Published on Tue, 04/28/2020 - 12:46

సాక్షి, అమరావతి: ఇంటో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరో తన తాబేదారుడు రాసిన లేఖపై చంద్రబాబు సంతకం చేసినట్లు ఉందని ఆయన విమర్శించారు. శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలే అని అన్నారు. ఆ లేఖలో ఉపయోగపడే అంశాలు ఏమి లేవని ఆయన విమర్శించారు. బాబు ఆయన కుమారుడు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. బాబు అవగాహన లేకుండా రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారని ఆయన అన్నారు. బాబు హైదరాబాద్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను లాక్‌డౌన్ పాటించమని చెపుతున్నాడని కానీ ఆయన కుమారుడు రోడ్లు మీద షికార్లు చేస్తున్నాడని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కనీసం మొహానికి మాస్క్ కూడా లోకేష్ ధరించలేదన్నారు.

చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ అని, శవాలు మీద పేలాలు ఎరుకొనే రకం టీడీపీ నేతలని శ్రీకాంత్‌ విమర్శించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లును ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసిందని తెలిపారు. నాయకత్వం అంటే బిల్డప్‌లు ఇవ్వడం కాదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పాత ఫొటోలతో ప్రజలను  బాబు మభ్యపెడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ఫీజ్ రియంబర్స్ మెంట్‌కు రూ. 4 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.రాష్ట్రాన్ని బాబు అప్పుల ఉబిలోకి నెట్టారని విమర్శించారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కరోనా నివారణలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన గుర్తు చేశారు.

వైస్సార్‌సీపీ నాయకులు అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఆలాంటి నేతలు వల్లనే కరోనా వచ్చిందని మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని శ్రీకాత్‌రెడ్డి మండిపడ్డారు. దళితుడైన కనగరాజును ఎన్నికల కమిషనర్‌గా నియనిస్తే చంద్రబాబు తట్టుకోలేక ఆయన వలన గవర్నర్ కార్యాలయంలో కరోనా వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్‌ ఆగ్రహించారు. ప్రధానమంత్రి వలన దేశంలో కరోనా వచ్చిందని విమర్శలు చేయగలవా చంద్రబాబు అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కరోనా వస్తే చనిపోతారని ప్రజలను భయపెడితే.. కరోనా వస్తే చనిపోరని సీఎం జగన్‌ ప్రజలకు ధైర్యం చెపుతున్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి కానీ దానికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.బాబు పక్క రాష్టంలో దాక్కొని విమర్శలు చేస్తున్నారని, ప్రజలపై అభిమానం ఉంటే బాబు రాష్ట్రానికి రావాలని శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ చేశారు.

Videos

ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది

పెరిగిన ఓటు శాతం కేటగిరీల వారీగా..!

ఏపీలో ఎందుకిలా ?..రాష్ట్రం రావణకాష్టంగా మారటానికి అసలు కారణం

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)