amp pages | Sakshi

కమీషన్లు అందనందుకే ఆరోగ్యశ్రీ బంద్‌ 

Published on Tue, 12/18/2018 - 03:49

సాక్షి, హైదరాబాద్‌ : చినబాబు లోకేష్‌కు కమీషన్లు అందనందువల్లే నిరుపేదలకు ఉత్తమ వైద్య వసతి కల్పించే ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో బంద్‌ అయ్యాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు శ్రీరామరక్షగా ఉన్న ఈ పథకం ఇప్పుడు టీడీపీ నేతలు దోచుకునే పథకంగా తయారైందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ పాలనలో ఆరోగ్యశ్రీ ఉందన్న నమ్మకంతో రాష్ట్రంలో ప్రజలందరూ నిశ్చింతగా గుండెమీద చెయ్యేసుకుని ధైర్యంగా ఉండేవారన్నారు. అలాగే 108 వాహనాలు పది నిమిషాల్లో వచ్చి వాలేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను నిర్వీర్యం చేస్తోందని, ఈవిషయాన్ని నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలోను, బహిరంగ సభల్లోనూ ప్రస్తావిస్తున్నాని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.500 కోట్ల బకాయిలు చెల్లించనందున యాజమాన్యాలు వైద్య సదుపాయాలను నిలిపేశాయని తెలిపారు. రాష్ట్రంలోని  35 లక్షల మందికి వైద్య సదుపాయం బంద్‌ అయ్యిందని చెప్పారు.  

సీఎం వ్యక్తిగత ప్రచారాలకు ప్రజా సొమ్ము దుర్వినియోగం..  
సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్రాల్లో సంబరాలకు, సభలకు ప్రత్యేక హెలీకాప్టర్లు, విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని  ఖర్చు చేస్తున్నారని, మరోవైపు తన వ్యక్తిగత ప్రచారానికి, ధర్మ పోరాటదీక్షల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఆరోగ్య శ్రీ ఎందుకు నిలిపి వేశారని ఆరా తీయగా చినబాబుకు (లోకేశ్‌) కమీషన్లు అందనందువల్లే దీనిపై శ్రద్ధ చూపడం లేదని అంటున్నారని చెప్పారు. తుపాను భయంకరంగా వస్తుంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం చెన్నై వెళ్లారని, తర్వాత రాజస్థాన్‌కు పయనమవుతున్నారని దుయ్యబట్టారు.  ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగులు హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని చంద్రబాబు తొలగించారని, అందుకే నవరత్నాల్లో రూ.1,000 పైబడిన వైద్యం ఖర్చు ఎదురైతే ఏ ప్రాంతంలోనైనా చికిత్స చేసుకోవచ్చన్న సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నిరుపేద మధ్యతరగతి ప్రజలపై చంద్రబాబు పగబట్టారని ఆరోగ్యశ్రీని నిర్వీర్య పరిచి తన రాజకీయ ప్రయోజనాలకు సీఎం రిలీఫ్‌ పండ్‌ ద్వారా వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే చెక్కులతో ఫోటోలు తీసి ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు.  ఆరోగ్యశ్రీ పథకం బకాయిలు రూ.500 కోట్లు తక్షణమే చెల్లించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.   

Videos

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)