amp pages | Sakshi

నీళ్లకు 20, పాలకు 18 రూపాయలా!

Published on Wed, 04/17/2019 - 17:36

సాక్షి, న్యూఢిల్లీ : ‘బాటిల్‌ మంచినీరు 20 రూపాయలు. లీటరు పాలు 17, 18 రూపాయలా! ఇదెక్కడి అన్యాయం. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వ్యాపారులు హాయిగానే బతుకుతున్నారు. రైతులకే చావొచ్చింది’ అని లింబాదేవీ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశు శిబిరంలో కచ్రూసాహెబ్‌ రాథోడ్‌ అనే 62 ఏళ్ల రైతు వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలంకాక వర్షాలు లేకపోవడంతో ఇతర రైతుల్లాగానే తాను పంట వేయలేక పోయానని, దీనికి మోదీ మాత్రం ఏం చేయగలరని అదే శిబిరంలో పశువులతోపాటు తలదాచుకుంటున్న హర్షుభాయ్‌ సనప్‌ అనే రైతు వ్యాఖ్యానించారు. రాథోడ్‌ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడల్లా బీజేపీ కార్యకర్త  అయిన సనప్‌ అడ్డుపడుతున్నారు. 2012 నుంచి మూడేళ్లపాటు వర్షాలు లేకపోవడం వల్ల రైతులకు ఈ దుస్థితి దాపురించిందని సనప్‌ వాదించారు. పంటలు పండించినా మార్కెట్‌లో తమ పంటలకు మార్కెట్‌లో ఎవరు గిట్టుబాటు ధరలు ఇస్తారని ఆయన నిర్లిప్తత వ్యక్తం చేశారు. 

‘మార్కెట్‌ ధరల పరిస్థితిని పక్కన పెట్టండి, పంటలను మార్కెట్‌ను తరలించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ యువ రైతు వ్యాఖ్యానించారు. లింబాదేవీ గ్రామం మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఉంది. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తుండడంతో పశువుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో పశు శిబిరాలను నిర్వహిస్తోంది. శిబిరాల నిర్వహణ పట్ల కూడా రైతులు అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఈ శిబిరాలను ఏర్పాటు చేశారని, అది కూడా మార్చి నెలలో ఏర్పాటు చేశారని, పశువుల గ్రాసం కూడా అంతంత మాత్రంగానే అందుతుందని పలువురు రైతులు విమర్శించారు. ఎన్నికల గురించి ప్రశ్నించగా మోదీ ప్రభుత్వం పట్ల కొందరు సంతప్తి వ్యక్తం చేయగా, ఎక్కువ మంది ఎవరొస్తే మాత్రం తమకు ఒరిగేదేముంటుందని నిర్లిప్తత వ్యక్తం చేశారు. మోదీ కారణంగా కనీసం రోడ్లు, వంతెనలు, మంచినీళ్లు వస్తున్నాయని చెప్పారు. 

బీడ్‌లో ఎవరు గెలుస్తారు ?
బీడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 18వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. 2014, అక్టోబర్‌లో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్‌ ముండే అఖండ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఆమె తండ్రి గోపీనాథ్‌ ముండే మరణంతో ఆ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి 36 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ వారిలో ప్రీతమ్‌ ముండేతోపాటు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బజరంగ్‌ సోనవానేలే ప్రముఖులు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ప్రీతమ్‌ ముండే సమీప బంధువు, ఎన్సీపీ నాయకుడు ధనంజయ్‌ ముండేకు మద్దతు ఇస్తున్న కారణంగా పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ విజయావకాశాలు ప్రీతమ్‌ ముండేకే ఉన్నాయి. 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)