amp pages | Sakshi

పోలవరంపై విచారణ జరిపితే బాబు జైలుకే

Published on Mon, 12/04/2017 - 01:48

సాక్షి, విజయవాడ : పోలవరంపై విచారణ జరిపిస్తే సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా జైలుకు వెళ్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పోలవరంపై విలేకరులతో మాట్లాడారు. పోలవరం కడితే 800 టీఎంసీలు వాడుకున్నా అడిగేవారు ఉండరని, ఆఖరి పాయింట్ కావడమే దీనికి కారణమన్నారు. శ్రీ రాంసాగర్ తరువాత గ్రావిటీ ద్వారా నీరు తీసుకునే వీలు పోలవరం దగ్గరే ఉందని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 లోనే పోలవరం టెండర్లు పిలిచి, ఒక్కో అనుమతిని ఆయనే సాధించారని గుర్తు చేశారు. ముంపు ప్రాంతాలకు ఇచ్చే పునరావాసం ఖర్చుకు ఆనాడే ముందు చూపుతో వైఎస్ఆర్ లెక్కగట్టి ప్రాజెక్ట్ ఖర్చులో చూపించారని తెలిపారు. పక్క రాష్ట్రాల అభ్యంతరాలకు కూడా వైఎస్ఆర్ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్ష ఆరోపణలను కేంద్రం ప్రశ్నిస్తోంది..
2014లో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో పెట్టిన పోలవరంను రాష్ట్రం ఎందుకు కడతామని పట్టుబట్టిందని ఈ సందర్భంగా ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014నాటి రేట్లకే కేంద్రం నిధులు ఇస్తుందని ఆనాడే నీతి అయోగ్ చెబితే బాబు ఎందుకు అంగీకరించారని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖల్లో అమర్‌జిత్ సింగ్ ఏకంగా టెండర్లు నిలిపివేయమని సూచించారని, ఇ-ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన రాష్ట్ర వెబ్ సైట్ లో ఆలస్యంగా ఎందుకు వివరాలు పెట్టారని ఆ లేఖలో అభ్యంతరాలు తెలిపారని ఉండవల్లి మీడియా దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ నోటిఫికేషన్ లో 1300 కోట్లని, వెబ్‌సైట్లో సుమారు 1400 కోట్లు పెట్టారని, కేవలం కాంట్రాక్టుల కోసమే అని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ఇప్పుడు కేంద్రం కూడా అడుగుతోందన్నారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు.

పోలవరంతో ఏపీ సస్యశ్యామలం..
1600 కోట్లు పట్టిసీమ కోసం, 1800 కోట్లు పురుషోత్తం పట్నంకు కేటాయించారన్న ఉండవల్లి..  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి రాసిన లేఖలో పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారని, ఈ ప్రాజెక్టులు సరిపోతాయి తప్ప, పోలవరం అక్కరలేదని లేఖలో ప్రస్తావించారని తెలిపారు. 17,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యం తో ఆనాడు పోలవరం కాలువలను వైఎస్ఆర్ తవ్వించారని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు.

పనులు చేయకపోతే తప్పించండి..
ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పనిచేయడం లేదని తెలిస్తే, సదరు కంపెనీతో మాట్లాడి తప్పించాలన్నారు. ఆనాడు వైఎస్ఆర్ పోలవరం పనులు చేయడం లేదని టిడిపి నేత నామా నాగేశ్వరరావు కంపెనీని పిలిచి, పనుల నుంచి తప్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఇకనైనా పోలవరంపై నిజాలను ప్రజలతో పంచుకోవాలని హితవు పలికారు. సాక్షాత్తు బీజేపీ అధికార ప్రతినిధే లెక్కలు బయటపడితే జైలుకు వెళ్తారని హెచ్చరించినా చంద్రబాబు కళ్ళు తెరవడం లేదన్నారు. ఇప్పటికైన పోలవరంపై చంద్రబాబు శ్వేత పత్రం ప్రకటించాలని ఉండవల్లి డిమాండ్‌ చేశారు. 2.16లక్షల కోట్లు ఈ మూడేళ్ళలో రాష్ట్రం చేసిన అప్పులని. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయో.. లెక్కలు చెప్పాలన్నారు.

యూపీఏ ప్రభుత్వం ముందు చూపు..
యూపీఏ ప్రభుత్వం తన ఆఖరి కేబినెట్ సమావేశంలో పోలవరం నిర్మాణంకు ఎంత ఖర్చుఅయితే అంతా కేంద్రమే భరించాలని తీర్మానించి చట్టం చేసిందన్నారు. దీనిని గమనించకుండా చంద్రబాబు నీతి అయోగ్  ద్వారా రాష్ట్రమే పోలవరం నిర్మాణం చేపట్టేందుకు అంగీకారం తెలిపాడన్నారు. ఏడు ముంపు మండలాలను 2014 మార్చి 1న ఏపీలో విలీనం చేస్తూ యూపీఏ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కు రాష్ట్రపతికి పంపారని, అసెంబ్లీ అభిప్రాయం లేదని అధికారులు దానిని పక్కన పెట్టారని ఉండవల్లి గుర్తు చేశారు. మే 28న జైరాం రమేష్ చొరవ తీసుకుని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చెప్పి ముంపు మండలాలపై ఎన్డీఎ ప్రభుత్వం ద్వారా ఆర్డినెన్స్ తెప్పించారన్నారు. ఇది తన ఘనతే అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 

కాపు రిజర్వేషన్లపై స్పందిస్తూ.. మంజునాథ్ నివేదిక లేకుండా కమిషన్ రిపోర్ట్కు  చట్ట బద్దత ఏమేరకు ఉంటుందని ప్రశ్నించారు. చట్టాలపై గౌరవం లేకుండా బాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)