amp pages | Sakshi

వ్యవసాయాన్ని పండగ చేస్తాం..

Published on Wed, 02/21/2018 - 01:25

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటామని, వ్యవసాయాన్ని పందుగ చేసి అన్నదాతల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా పాలన సాగిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సహకార రంగంలో మూత పడిన డెయిరీలన్నింటినీ రైతులకు మేలు చేసే విధంగా పునరుద్ధరిస్తామని, రైతుల కోసం ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం 93వ రోజు ప్రకాశం జిల్లా కొండెపి శాసనసభా నియోజకవర్గంలోని తిమ్మపాలెం వద్ద రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. 

అన్నదాతల శ్రేయస్సే లక్ష్యం 
‘‘వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆరాటంతో నవరత్నాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించాం. రైతులు వ్యవసాయాన్ని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బంది పడేది పెట్టుబడి కోసం. ఆ పెట్టుబడిని తగ్గిస్తే రైతులకు ఆదాయం ఎక్కువ అవుతుంది. పెట్టుబడి తగ్గించడం కోసం మొట్టమొదటిగా ప్రతి రైతుకు పగటి పూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తాం. రెండో కార్యక్రమంగా రైతులు తీసుకునే పంట రుణాలపై వడ్డీ లేకుండా చేస్తాం. ప్రభుత్వమే బ్యాంకులకు ఆ వడ్డీ కడుతుంది. మూడో కార్యక్రమంగా...  మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇచ్చి వారికి తోడుగా ఉంటాం. దీంతో ఎకరం పొలం ఉన్న రైతన్నకు 85 నుంచి 90 శాతం ఖర్చులు దాదాపుగా వచ్చేసినట్లే. రెండెకరాలున్న ప్రతి రైతుకు ఈ పెట్టుబడి ఉపయోగపడుతుంది.

అంతకన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ మొత్తం కాస్తో కూస్తో ఉపయోగపడుతుంది. నాలుగో కార్యక్రమంగా రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా మన ప్రభుత్వమే బోర్లు వేయిస్తుంది. ప్రస్తుతం రైతులు సొంత ఖర్చులతో బోర్లమీద బోర్లు వేసుకుని వాటిలో నీళ్లు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను విముక్తి చేయడానికే ఉచితంగా బోర్లు వేయించే పథకాన్ని ప్రవేశ పెడతాం. శనగ, కంది, మినుము, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థ పడుతున్న పరిస్థితుల నుంచి ఆదుకుంటాం. రైతు పంట వేయడానికి ముందే వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపించే విధంగా ఆ పంటను ఫలానా రేటుతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముందుగానే ప్రకటిస్తాం. దాని కోసం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.  అకాల వర్షాలు, కరువు వచ్చినపుడు రైతులకు ఇపుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ లభించడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు రూ.4,000 కోట్ల(ఇందులో సగం కేంద్రం ఇస్తుంది)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం’’ అని జగన్‌ హామీ ఇచ్చారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)