amp pages | Sakshi

ప్రజావ్యతిరేక విధానాలపై ధర్నా

Published on Mon, 06/18/2018 - 10:57

సంగారెడ్డి జోన్‌: దేశంలో మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్‌ 5న జరిగే ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ హేమలత అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని బాలాజీ మంజీరా గార్డెన్స్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘ప్రత్యామ్నాయ ఆర్థిక రాజకీయ విధానాలు– కార్మికవర్గం పాత్ర’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు, కూలీలు, రైతులందరితో లక్షలాది మంది కలిసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేస్తామని, మోదీ పాలన లో అచ్చేదిన్‌లన్ని , కార్పొరేట్, పెట్టుబడిదార్లకే వచ్చాయన్నారు.  కార్మికుల ఐక్యతను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందన్నారు. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ పేరుతో కేంద్రం కొత్త సవరణను ముందుకు తెచ్చి కార్మికులకు , ఉద్యోగులకు భద్రత లేకుండా చేసిందని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసిందని,  ఇన్సూరెన్స్‌ , బ్యాంకింగ్, రైల్వే, రక్షణ, ఫార్మా రంగాలను పూర్తిగా బలహీనం చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనం, పనిహక్కు సామాజిక భద్రత కోసం అమలవుతున్న బెనిíపిట్స్‌ స్థానంలో బీమా ఆధారిత విధానాన్ని తెచ్చిందన్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సవరించి అమలు చేస్తూ ఆ విధానాలనే దేశ వ్యాప్తంగా చేయడం కోసం ప్రయత్నిస్తుందన్నారు.

అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు కె.రాజయ్య , బి. మల్లేశంలు మాట్లాడుతూ మన బతుకులు బాగు చేసే విధంగా ఈ ప్రభుత్వాల మీద పోరాడాలని, అందుకు పాలకులు సహకరించకపోతే నేటి పాలకులనే మార్చుకోవాలన్నారు. మన కోసం పని చేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు.

 సామాజిక న్యాయం– సమగ్రాభివృద్ధి అనే ఏజెండాను నిజమైన అర్థంలో అమలు చేసేందుకు తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రాజకీయ వేదిక ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, నాయకులు ఎస్‌.మహిపాల్, పి.మంగ, జయరాజు, యాదగిరి, స్వాతి, నాగేశ్వర్‌రావు, మొగులయ్య, బాలరాజు, పెంటయ్య, మౌలాలీ, వెంకటరాజం, యాదయ్య, శ్రీధర్, నాగభూషణం అరుణ, వీరమణి తదితరులు పాల్గొన్నారు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌