amp pages | Sakshi

ఒక సీటు..ఇద్దరు పోటీ

Published on Thu, 04/26/2018 - 09:42

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రక్రియలో ఓ ఘట్టం ముగిసింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాష్ట్రంలో ఫలితాలపై కీలక ప్రభావం చూపనున్న జేడీఎస్‌లో గందరగోళం నెలకొంది. నామినేషన్ల పర్వంలో భాగంగా టికెట్ల కేటాయింపు చివరిరోజు వరకు పెండింగ్‌లో ఉంచడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. హైదరాబాద్‌ కర్ణాటక, ముంబయి కర్ణాటక ప్రాంతాల్లోని పలు స్థానాల్లో ఇద్దరు చొప్పున జేడీఎస్‌ బీఫారం, సీఫారాలతో నామినేషన్‌ వేశారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు.

చివరిరోజు హడావుడి
జేడీఎస్‌ 126 మంది అభ్యర్థులతో ఫిబ్రవరిలోనే తొలిజాబితా విడుదల చేసింది. తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలకు రెండోజాబితాలో టికెట్లు ఇచ్చింది. కానీ నామినేషన్ల సమర్పణకు చివరిరోజైన మంగళవారం కూడా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. ఈ హడావుడిలో కొందరికి బీ ఫారం ఇచ్చి అదేస్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లుగా కొందరికి సీ ఫారం అందజేశారు. సుమారు 10 నియోజకవర్గాల విషయంలో ఇలా జరిగింది. అయితేబీ, సీ ఫారాలు పొందిన ఇద్దరూ నామినేషన్లు వేయడంతో ఒకేచోట ఇద్దరు పోటీ పడినట్లు అయ్యింది. పార్టీ అధిష్టానం మాత్రం బీఫారం రద్దు చేస్తూ సీఫారం అందజేసినట్టు తెలిపింది. కేఆర్‌ పేట ఎమ్మెల్యే నారాయణగౌడకు పార్టీ టికెట్‌ తిరస్కరించింది. ఆ స్థానంలో బీఎల్‌ దేవరాజ్‌ సి ఫారం అందుకుని చివరి నిమిషంలో నామినేషన్‌ సమర్పించారు. దేవనహళ్లి స్థానానికి కూడా అధిష్టానం కొత్త అభ్యర్థికి సీ ఫారం అందజేసింది. అక్కడ ఉన్న పిళ్లమునిశామప్ప టికెట్‌ను రద్దు చేస్తూ ఆ స్థానంలో నిసర్గ నారాయణస్వామిని బరిలో దింపింది. శిడ్లఘట్ట అభ్యర్థిపై కూడా గందరగోళం నెలకొంది. రవికుమార్, రాజన్నలు నామినేషన్‌ వేశారు.

27న సర్దుబాటు చేస్తారా
ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఈ నేపథ్యంలో ఒకే స్థానంలో పోటీ చేస్తున్న ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకునేలా అధిష్టానం బుజ్జగింపులు చేపడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఎవరున్నారనేది స్పష్టమవుతుందని పార్టీ పెద్దలు తెలిపారు.

అంతా సర్దుకుంటుంది: దేవేగౌడ
 పార్టీలో చోటు చేసుకున్న అసమ్మతి సర్దుకుంటుందని మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ జాన్‌ బోనర్‌ దేవేగౌడతో బుధవారం బెంగళూరులో సమావేశమయ్యారు. అనంతరం దేవేగౌడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు ఉన్నమాట వాస్తవమే. కానీ త్వరలోనే అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికలో కాస్త గందరగోళమైందన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్లు వైఫల్యంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. మోదీ ఏదో చేయాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. జాన్‌బోనర్‌ మాట్లాడుతూ తాను దేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించానన్నారు. అయితే దేవేగౌడ పాలనలో దేశం, జేడీఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచాయని తెలిసినట్టు చెప్పారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)