బెంజ్‌సర్కిల్‌లో చంద్రబాబు హైడ్రామా

Published on Wed, 01/08/2020 - 22:51

సాక్షి, విజయవాడ : పాదయాత్ర పేరుతో చంద్రబాబునాయుడు బుధవారం విజయవాడలో హడావుడి చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద అనుమతి లేని ర్యాలీ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి ర్యాలీగా ఆటోనగర్ వరకూ పాదయాత్రగా వెళ్లేందుకు చంద్రబాబు యత్నించారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన పచ్చపార్టీ నాయకులు.. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసు వ్యాన్‌ తాళం దొంగిలించడమే కాకుండా.. తమ నేతను అరెస్ట్‌ చేస్తారా అంటూ వాగ్వాదానికి దిగారు. చంద్రబాబును అరెస్ట్‌ చేస్తున్నారు.. బెంజ్‌సర్కిల్‌కు రావాలంటూ టీడీపీ ఆఫీస్‌ నుంచి కార్యకర్తలకు మెసేజ్‌లు పంపి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు బెంజ్‌సర్కిల్‌ వద్దకు వచ్చి గంటపాటు హడావుడి చేశారు. చంద్రబాబు తానా అంటే తందానా అంటూ పచ్చమీడియా ఏదో జరిగినట్లు ప్రసారం చేసింది. ఇక చంద్రబాబు చేసిన హైడ్రామాకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ