amp pages | Sakshi

‘గవర్నర్‌-చంద్రబాబు భేటీ.. దేనికి?’

Published on Tue, 04/24/2018 - 14:34

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ కోసం ఈ నాలుగేళ్లలో ఏనాడైనా కేంద్రాన్ని నిలదీశారా? అని వైఎస్సార్‌ సీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ, సీఎం చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఉన్నపళంగా గవర్నర్‌తో భేటీ కావాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందని బొత్స ప్రశ్నించారు. 

‘రాష్ట్రం కోసం ఏనాడూ ఆలోచించని చంద్రబాబు.. ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపారు. కేంద్రంతో దూకుడు వద్దని గవర్నర్‌ సూచించినట్లు టీడీపీనే చెబుతోంది. మరోవైపు తనపై కేంద్రం కేసులు పెట్టాలని చూస్తోందంటూ చంద్రబాబు చెబుతున్నారు. కేసులు పెడితే తిరగబడాలని పైగా ప్రజలను ఆయన పిలుపునిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గనుక బాబుపై చర్యలు తీసుకోకుంటే ఆ రెండు పార్టీలు లాలూచీ పడ్డట్లే. చీకటి ఒప్పందాన్ని ప్రజలకు చెప్పాలి. ఏపీలో టీడీపీకి నూకలు చెల్లిపోయాయి’ అని బొత్స తెలిపారు. 

ఏప్రిల్‌ 30న వంచన దినం.. బీజేపీ-టీడీపీ కలిసే ఏపీ ప్రజలను మోసం చేశాయన్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాట తప్పారన్నారు. అందుకే ఈ నెల 30వ తేదీన వంచన దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బొత్స తెలిపారు.  వైఎస్సార్‌ సీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే ఈ పాటికి కేంద్రం దిగొచ్చేదన్నారు. ఒక్కసారి ఓట్లేసిన పాపానికే బలహీన వర్గాలకు అణగదొక్కుతారా? అని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.  జస్టిస్‌ ఈశ్వరయ్య లేఖపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసిన బొత్స.. ఎల్లో మీడియా ఈ వార్తను ఎందుకు హైలెట్‌ చేయలేదని నిలదీశారు. చంద్రబాబుకు నష్టం వచ్చే వార్తలను బహుశా ఎల్లో మీడియా ప్రసారం చేయదేమోనని ఆయన ఎద్దేవా చేశారు. 

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)