amp pages | Sakshi

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు

Published on Wed, 04/15/2020 - 05:03

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ మీడియా ప్రశంసిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం లేనిపోని విమర్శలు చేస్తున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రతిరోజు సుమారు 2 వేల కరోనా టెస్టులు చేస్తుంటే.. చంద్రబాబు ఇంకా కరోనా టెస్టుల గురించి మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రతిరోజూ ఎక్కువ మందికి టెస్ట్‌లు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని గుర్తు చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే..

► అఖిలపక్షం వేయాలంటున్న చంద్రబాబు ఏనాడైనా ఒక మంచి సలహా ఇచ్చారా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబు ప్రధానికి ఎందుకు వివరించలేదు.
► దేశంలో కరోనా పోవాలని అందరూ కోరుకుంటుంటే.. చంద్రబాబు, ఆయన బృందం మాత్రం రాష్ట్రానికి కరోనా రావాలని కోరుకుంటున్నారు.
​​​​​​​► కరోనాపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహించే ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నారు. 
​​​​​​​► రాష్ట్రంలో ఏ ఒక్కరూ తినడానికి తిండి లేక పస్తులు ఉండకూడదని.. ఏ ఒక్కరూ అన్నం కోసం ఇబ్బందులు పడకూడదనేది ముఖ్యమంత్రి ఆలోచన. అందుకే.. అందరికీ రేషన్‌ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వమిచ్చే రూ.1,000 చొప్పున అందరికీ అందించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
​​​​​​​► దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు రోజుల్లో రేషన్‌ కార్డు జారీ చేసి రేషన్‌ అందించాలని కూడా చెప్పారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరోపక్క రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు.
​​​​​​​► ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా రైతుల వద్దకే వెళ్లి ధాన్యం సమీకరించాలని ఆదేశించారు. అరటి, టమాట, బత్తాయి, మామిడి వంటి పండ్లను మెప్మా గ్రూపుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
​​​​​​​► క్వారంటైన్‌లో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులుంటే నిత్యావసర సరుకులతోపాటు రూ.2 వేల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. 

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌