amp pages | Sakshi

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స

Published on Tue, 08/13/2019 - 19:00

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చారిత్రత్మక నిర్ణయాలు చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గత ఐదేళ్లలో రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయని చెప్పారు. అందుకే ప్రజలు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానిది పారదర్శక పాలన అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ సంక్షేమం, అభివృద్ధి దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలు ఉన్నాయి. నాలుగు లక్షలుగా పైగా ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు పాలనలో నదుల అనుసంధానం కాకుండా.. నిధుల అనుసంధానం చేశారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. గత ఏడాది కాలంగా పోలవరం పనుల్లో తట్ట  మట్టి కూడా వేయలేదు. టీడీపీ పాలనలో శాసనసభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం లభిస్తోంది. చంద్రబాబు పాలనలో అంతా కరువుతో నిండిపోయింది. కానీ వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక వాతావరణం మారింది.. వర్షాలు పడుతున్నాయి. అన్నా క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ నాయకులు కోరిన చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో బిల్డింగ్‌కు రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. కానీ తాము పేదలకు ఉపయోగపడేలా క్యాంటీన్లు నిర్వహిస్తాం. గత ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. త్వరలో ఇళ్ల నిర్మాణంలోని అక్రమాలపై విచారణ జరిపిస్తామ’ని తెలిపారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌